వార్తలకు తిరిగి వెళ్లండి
చిరుతల వేట: నిందితుల అరెస్ట్

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో రెండు చిరుతలను హతమార్చిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా సీపీ సాయిచైతన్య, డీఎఫ్వో సుశాంత్ తీవ్రంగా హెచ్చరించారు.
ఒక ఘటనలో చిరుతను కొట్టి చంపి బావిలో పడేయగా, మరో ఘటనలో విషప్రయోగం చేసి చంపినట్లు విచారణలో తేలింది. వీరి నుంచి నాటు తుపాకులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...