వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణానదికి గోదావరి జలాలు
గోదావరి జలాలు శుక్రవారం నాటికి కృష్ణానదిలో చేరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మూడు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న పట్టిసీమ మోటార్లను అధికారులు స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం 20 మోటార్ల ద్వారా రోజుకు 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు 1.33 టీఎంసీల జలాలను పోలవరం కుడికాలువకు విజయవంతంగా మళ్లించారు.
Comments
Loading comments...