వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో క్రీడామైదానం ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్ కోరారు. గురువారం ములుగులో కలెక్టర్ హేమంత్ భోర్ఖడేను కలిసి వినతిపత్రం అందజేశారు. క్రీడామైదానం ఉంటే యువత, విద్యార్థులు నిత్యం ఆటలు ఆడి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
కార్యక్రమంలో వసంత శ్రీను, బాడిష ఆదినారాయణ, వహీద్, ఫయాజ్, మురుకుట్ల నరేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

