వార్తలకు తిరిగి వెళ్లండి
కష్టకాలంలో కాపాడిన కోహ్లీ: పీవీ సింధు

వరుస గాయాలు, ఓటములతో తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచారని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీని కలిశానని, ఆయన మాటలు తనకు ఎంతో మేలు చేశాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వారిద్దరి మధ్య జరిగిన ప్రత్యేక సంభాషణను బయటకు చెప్పనప్పటికీ, కోహ్లీ అందించిన మానసిక ధైర్యానికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని సింధు తెలిపారు.
Comments
Loading comments...