వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం సామరెల్లి, రాయికురిడి గ్రామాల మధ్య కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారడంతో గ్రామస్థులు శ్రమదానం చేసి తాత్కాలికంగా పూడ్చారు.
కల్వర్టు మరమ్మతులపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

