వార్తలకు తిరిగి వెళ్లండి
కిమ్స్ వైద్యుల అరుదైన విజయం

తీవ్రమైన ఏఆర్డీఎస్తో మృత్యువు అంచుల్లో ఉన్న 32 ఏళ్ల యువ వైద్యురాలిని హైదరాబాద్ కిమ్స్ వైద్యులు ఎక్మో చికిత్సతో కాపాడారు. సాధారణ వెంటిలేటర్తో ఫలితం లేకపోవడంతో, 25 రోజుల పాటు అరుదైన ఎక్మో చికిత్స అందించి ఆమెకు ప్రాణం పోశారు.
సోలాపూర్ నుంచి ఎక్మో సాయంతో ఆమెను కిమ్స్కు తరలించి, వైద్యుల సమన్వయంతో చికిత్స అందించారు. సరైన సమయంలో కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం, వైద్యుల కృషి ఆమెను ప్రాణాపాయం నుంచి రక్షించాయని డాక్టర్ విశాల్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...