వార్తలకు తిరిగి వెళ్లండి
సైకిల్పై కోర్టుకు జిల్లా జడ్జి

కోయంబత్తూర్ జిల్లా 5వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి పి.కె.శివకుమార్ (53) తన సామాన్య జీవనశైలితో అందరినీ ఆకట్టుకుంటున్నారు. హోదాను పక్కనపెట్టి, గతంలో మేజిస్ట్రేట్గా పనిచేసినప్పటి నుంచీ ఇప్పటివరకు ఆయన రోజూ సైకిల్పైనే కోర్టుకు వెళ్తున్నారు.
కేవలం ప్రయాణంలోనే కాక, మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇంటి నుంచే తెచ్చుకుని కోర్టు సిబ్బందితో కలిసి తింటారు. కోర్టు ప్రాంగణంలో అటెండెంట్లు తన వెనుక రాకుండా ఒంటరిగానే నడుస్తూ ఎంతో నిరాడంబరంగా వ్యవహరిస్తున్నారు.
Comments
Loading comments...