వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబయిలో కూలిన భవనం: ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ఎడతెరిపి లేని వర్షాలకు ముంబయిలోని మన్ఖుర్ద్లో శిథిలావస్థకు చేరిన ఒక భవనం రేకుల ఇంటిపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్తర్ జహాన్, ఆమె నలుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు.
తెల్లారితే ఇల్లు ఖాళీ చేయాలని సామాన్లు సర్దుకుంటుండగా ఈ విషాదం జరిగింది. ప్రమాదకరమైన ఈ అనధికారిక కట్టడంపై చర్యలు తీసుకున్న పోలీసులు, భవన యజమాని మరియు కాంట్రాక్టర్ను అరెస్టు చేశారు.
Comments
Loading comments...