వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ25 పెట్రోల్పై కేంద్రం కీలక అడుగు

భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో మరో కీలక మార్పు రానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉండగా, త్వరలోనే 25 శాతం ఇథనాల్ కలిపిన ఈ25 పెట్రోల్ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ వ్యూహాత్మక మార్పు ద్వారా ముడి చమురు దిగుమతులు మరియు కాలుష్యం భారీగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
Comments
Loading comments...