వార్తలకు తిరిగి వెళ్లండి

మాధాపూర్లోని రెజోనెన్స్ జూనియర్ కాలేజీ శాతవాహన బాయ్స్ హాస్టల్ విద్యార్థులు మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తాము తినే ఆహారంలో పురుగులు రావడంతో మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్టల్లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ ఘటనతో కాలేజీ క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

