వార్తలకు తిరిగి వెళ్లండి
భూగర్భ జలాల పునరుద్ధరణ

నగరంలో భూగర్భ జలాలు పడిపోవడంతో, వర్షపు నీటిని సంరక్షించేందుకు జలమండలి 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం పార్కులు, ప్రభుత్వ భవనాలు మరియు ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు, రీఛార్జ్ బావులను శాస్త్రీయంగా నిర్మిస్తోంది.
ఇకపై కొత్త నీటి కనెక్షన్లకు ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేస్తూ జలమండలి నిబంధనలు కఠినతరం చేసింది. ఎండిపోయిన బోర్లను రీఛార్జ్ బావులుగా మారుస్తూ, వాననీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Comments
Loading comments...