వార్తలకు తిరిగి వెళ్లండి
నౌకాదళంలోకి ‘INS మహేంద్రగిరి’

స్వదేశీ అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి'ని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో భారత నౌకాదళానికి అంకితం చేశారు. ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన ఈ ఆరో ఫ్రిగేట్ 'ఆత్మనిర్భర్ భారత్' సాధనలో మరొక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.
ఈ యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణులు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, గగనతల రక్షణ మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలతో సన్నద్ధమైంది.
Comments
Loading comments...