వార్తలకు తిరిగి వెళ్లండి
మితిమీరిన అభిమానం ఉద్యోగానికే ఎసరు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై ఉన్న మితిమీరిన అభిమానంతో ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్మిస్ట్రెస్ క్లాస్ రూమ్లో విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా సీఎం కరూర్ సభను ప్రత్యక్ష ప్రసారం చేసి చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.
విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించగా, అది హెడ్మిస్ట్రెస్ వ్యక్తిగత నిర్ణయమని తేలింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వం ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...