వార్తలకు తిరిగి వెళ్లండి
సీజేఐకి ‘ఇండియా’ కూటమి లేఖ

ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కాపాడాలని కోరుతూ 'ఇండియా' కూటమి పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి (సీజేఐ) లేఖ రాశాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్నారు.
బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ తటస్థతపై అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ తీవ్రమైన అంశంపై సీజేఐ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని రాజా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...