వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోతలతో మధ్యమానేరు జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వరదకాలువ ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. నీటి నిల్వలు పెరగడంతో ఆయకట్టు సాగు, భూగర్భ జలాలపై సానుకూల ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...
