వార్తలకు తిరిగి వెళ్లండి
సినిమాలు చూసి భర్త శవం మాయం

మియాపూర్లో భర్త పెంటేశ్ను హత్య చేసి, శవాన్ని మాయం చేసిన భార్య సత్యవతితో పాటు ఆమె ప్రియుడు మధుసూదన్రెడ్డి, స్నేహితుడు రాజేశ్లను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని గతేడాది నవంబరులో నిద్రమాత్రలు ఇచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం 'దృశ్యం' సినిమాలు చూసి మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించి దహనం చేసినట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
Comments
Loading comments...