వార్తలకు తిరిగి వెళ్లండి
ఎడారి దేశంలో ఘోరం

ఉపాధి కోసం కువైట్ వెళ్లిన నిజామాబాద్ జిల్లా కోరట్పల్లి తండాకు చెందిన మెకానికల్ ఇంజినీర్ గుగులోత్ కైలాశ్ (29) ఎడారిలో శవమై కనిపించాడు. క్రేన్ ప్రమాదంలో కైలాశ్ చనిపోగా, కేసు భయంతో శవాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు నిందితుడు కార్తీక్ ఒప్పుకున్నాడు.
నిందితుడిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 19న వాహనం రిపేర్ కోసమని కైలాశ్ను తీసుకెళ్లిన తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. సిసి ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ హత్యా ఉదంతాన్ని ఛేదించారు.
Comments
Loading comments...