వార్తలకు తిరిగి వెళ్లండి
ఆనంద కోర్సుకు భారీ ఆదరణ

దిల్లీ వర్సిటీ ప్రవేశపెట్టిన ‘ఆనంద విజ్ఞానశాస్త్రం’ కోర్సుకు విద్యార్థుల నుండి భారీ ఆదరణ లభిస్తోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ విలువ ఆధారిత కోర్సులో ఇప్పటివరకు 2 వేల మందికి పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఉప కులపతి యోగేశ్సింగ్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో 17 అనుబంధ కళాశాలలు దీనిని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పరిశోధనల కోసం మిరాండా హౌస్, దౌలత్రాం కళాశాలల్లో ప్రత్యేకంగా మైండ్ ల్యాబులను కూడా ఏర్పాటు చేశారు
Comments
Loading comments...