వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 14న విజయనగరంలో జిల్లా స్థాయి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు కోట కూడలి నుంచి ప్రారంభమై మూడు లాంతర్లు మీదుగా గంటస్తంభం వరకు ర్యాలీ కొనసాగుతుంది.
ర్యాలీలో 150 అడుగుల జాతీయ జెండాను ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు.
Comments
Loading comments...

