వార్తలకు తిరిగి వెళ్లండి
తుని వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని వద్ద విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న ఒక గూడ్స్ రైలు లూప్ లైన్లోకి వెళుతూ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున జరగ్గా, డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.
పట్టాలు తప్పిన బోగీని తొలగించేందుకు రైల్వే అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. దీనివల్ల పలు రైళ్లను మెయిన్ లైన్లోకి మళ్లించడంతో రాకపోకలు తాత్కాలికంగా ఆలస్యమయ్యాయని, అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...