వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థినులకు ఉచిత ఆటో

చెన్నైకి చెందిన ఆటో డ్రైవర్ రాజీ అశోక్ (54) ఆర్థిక ఇబ్బందుల వల్ల తన చదువు ఆపేశారు. అందుకే మరెవరూ చదువు మానకూడదనే ఉద్దేశంతో, ఆమె ప్రతిరోజూ 15 మంది విద్యార్థినులను ఉచితంగా పాఠశాలలకు చేరవేస్తున్నారు.
గులాబీ రంగు ఆటో నడిపే రాజీ.. పిల్లల కోసం బిస్కెట్లను సిద్ధంగా ఉంచుతారు. తన సంపాదన తగ్గినప్పటికీ, బాలికల భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్న ఈ సేవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...