వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారి భద్రతకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలను, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి చర్యల కోసం కేసు విచారణను వాయిదా వేసింది.
Comments
Loading comments...

