Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే ట్రిప్‌లో 4 జ్యోతిర్లింగాల దర్శనం: IRCTC

శ్రుతి రెడ్డి Jul 13, 2026 12:56 PM అల్ ఇండియా 8 viewsabout 3 hours ago
ఒకే ట్రిప్‌లో 4 జ్యోతిర్లింగాల దర్శనం: IRCTC - Udayam Digital
భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్' ద్వారా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు 17న గోరఖ్‌పూర్ నుండి ప్రారంభమయ్యే ఈ 9 రాత్రులు, 10 రోజుల యాత్రలో నాలుగు పవిత్ర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్‌లతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించే ఈ ప్యాకేజీ ధర రూ.18,380 నుండి ప్రారంభమవుతుంది. భోజనం, వసతి, రవాణా ఖర్చులతో కూడిన ఈ యాత్రకు EMI సదుపాయం కూడా కలదు.

Comments

G
Loading comments...