Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేపీహెచ్‌బీలో నేడు ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 12:03 PM హైదరాబాద్తెలంగాణ
కేపీహెచ్‌బీలో నేడు ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి నేడు కూకట్‌పల్లి నియోజకవర్గంలో పర్యటించి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం జరగనుంది. 5.87 ఎకరాల్లో రెండు దశల్లో రూ.43 కోట్ల అంచనా వ్యయంతో 1,160 ఇళ్లు నిర్మించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, 300 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...