వార్తలకు తిరిగి వెళ్లండి
పెట్టుబడుల గ్రౌండింగ్పైనే మా దృష్టి: మంత్రి నారా లోకేశ్
రచన దేవి Jun 29, 2026 7:01 AM అమరావతి 0 viewsabout 2 hours ago

ఏపీలో పెట్టుబడులను క్షేత్రస్థాయిలో గ్రౌండింగ్ చేయడంపైనే తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 750 పరిశ్రమలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తో జరిగిన భేటీలో ఏపీ-సింగపూర్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ప్రాజెక్టుల పురోగతిని ప్రతి 15 రోజులకోసారి నిశితంగా సమీక్షిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Comments
Loading comments...