Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో కొనసాగుతున్న వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 11:06 AM అల్ ఇండియా జాతీయ
అస్సాంలో కొనసాగుతున్న వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య - Udayam Digital
భారీ వర్షాలు, వరదలతో అస్సాం చిన్నాభిన్నమైంది. ఏడు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాలు 78కి చేరాయి. 551 గ్రామాలు, 21 వేల హెక్టార్ల పైచిలుకు పంట నీటమునిగాయి. ప్రభుత్వం 71 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఐఎండీ మరో 3 రోజులు వర్ష సూచనతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Comments

G
Loading comments...