వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు, వరదలతో అస్సాం చిన్నాభిన్నమైంది. ఏడు జిల్లాల్లో 3 లక్షలకు పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాలు 78కి చేరాయి.
551 గ్రామాలు, 21 వేల హెక్టార్ల పైచిలుకు పంట నీటమునిగాయి. ప్రభుత్వం 71 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. ఐఎండీ మరో 3 రోజులు వర్ష సూచనతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Comments
Loading comments...
