వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుదాఘాతంతో బావిలో పడి రైతు మృతి

నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు జీల నాగరాజు (46) మోటారును పరిశీలిస్తుండగా విద్యుత్ వైరు తెగిపడటంతో షాక్కు గురై బావిలో పడి మరణించారు.
మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...