వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని పది ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
అక్రమాస్తులకు సంబంధించి కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వరుస సోదాలతో రాష్ట్రంలోని అవినీతి అధికారుల్లో కలకలం రేగుతోంది.
Comments
Loading comments...

