వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి బండ (ఆర్డీఎస్) పథకం ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కులను కాపాడుకోవడంలో రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశ పనులకు భూసేకరణ చేపట్టాలని మంత్రి సూచించారు. ఆర్డీఎస్ కాలువ ద్వారా నీటి వాటాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

