Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈగల్‌ తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 4:34 PM ఏలూరుGeneral
ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఈగల్‌ తనిఖీలు - Udayam
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లో ఈగల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి ఏలూరు మీదుగా వచ్చే రైలులో అనుమానిత వ్యక్తులు, బ్యాగులు, లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా, తనిఖీలు కొనసాగుతాయని ఈగల్‌ ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయభాస్కర్‌ తెలిపారు. సమాచారం ఉంటే 1972, 112కు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...