వార్తలకు తిరిగి వెళ్లండి
ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...