వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ ఆసుపత్రులలో నిలిచిన ల్యాబ్ సేవలు

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని 350 ఆరోగ్య మందిరాలు, 200 డిస్పెన్సరీలు, 28 ఆసుపత్రులలో అవుట్సోర్సింగ్ ల్యాబొరేటరీ సేవలు హఠాత్తుగా నిలిచిపోయాయి. దీని వెనుక వందల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
నిర్దేశిత సంస్థ కాంట్రాక్ట్ను పొడిగించకపోవడంపై వైద్యులే అవినీతి ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. ₹650 కోట్ల స్కామ్కు ఇది అదనమని, ల్యాబ్ సేవల నిలిపివేత వెనుక పెద్ద లీలలు ఉన్నాయని మండిపడ్డారు.
Comments
Loading comments...