వార్తలకు తిరిగి వెళ్లండి
పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పిన భారత్

ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం కారణంగా భారత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టెర్రరిస్ట్ ఎప్పటికీ టెర్రరిస్టేనని, ఏ దేశమూ ఉగ్రవాదాన్ని సమర్థించకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ద్వంద్వ విధానాలను వీడాలని, ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు. అలాగే పాక్తో ఉన్న సింధు జలాల వివాదంపై కూడా భారత్ తరఫున ఆయన బలమైన వాదనను వినిపించారు.
Comments
Loading comments...