వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మండలం యండ్రాయి వేద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు చెరువులో మునిగి మృతిచెందారు. గోశాలకు చెందిన ఆవును బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురుపౌర్ణమి రోజే ఈ విషాదం చోటుచేసుకోవడంతో పాఠశాలలో, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...
