Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలండ్‌లో శ్రీకాకుళం వాసి మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 9:45 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పోలండ్‌లో శ్రీకాకుళం వాసి మృతి - Udayam
ఉపాధి కోసం పోలండ్‌ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసకు చెందిన బత్సల రాంబాబు(37) గుండెపోటుతో మృతి చెందారు. గతేడాది డిసెంబరులో ఆయన పోలండ్‌ వెళ్లారు. రాంబాబుకు భార్య లావణ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తెను చూడకుండానే ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని స్థానిక నేత శివప్రసాద్‌ కోరారు.

Comments

G
Loading comments...