వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంపల్లి జలాశయంలోకి చేరిన బురద రంగు వరదనీటిని ముల్కల్ల ఫిల్టర్ బెడ్లో తాత్కాలికంగా శుద్ధి చేసి మంచిర్యాలకు సరఫరా చేస్తున్నారు. అయితే శుద్ధి యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆరు ఫిల్టర్ బ్లాక్లలో ఐదు మాత్రమే పనిచేస్తున్నాయని సమాచారం. దీంతో నాణ్యమైన తాగునీరు అందడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

