Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాది గడిచినా అందని పరిహారం!

రూప దేవి Jun 30, 2026 5:34 AM సంగారెడ్డి 1 viewsabout 2 hours ago
ఏడాది గడిచినా అందని పరిహారం! - Udayam Digital
పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మరణించి నేటికి ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.కోటి పరిహారం బాధితులకు ఇంకా పూర్తిగా అందకపోవడం బాధాకరం. పరిశ్రమ యాజమాన్యం ప్రమాద బాధితులను, మిగిలిన కార్మికులను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విధులకు తీసుకోవాలని ఆశించిన కార్మికులకు తాఖీదులు ఇవ్వకుండానే తొలగించడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై బాధితులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...