Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటన: షాపుల కూల్చివేతపై వ్యాపారుల ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 3:09 PM అనకాపల్లి General
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మాడుగులలో ఆయన వెళ్లే మార్గంలోని షాపులను అధికారులు తొలగించారు. ఏ.కోడూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొననుండగా, హెలిప్యాడ్‌ సమీపంలోని షాపులను జేసీబీలతో కూల్చివేశారు. ఎలాంటి ఆటంకం లేకపోయినా షాపులను ఎందుకు తొలగిస్తున్నారంటూ చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు మాడుగుల వ్యాపార సంఘం అధ్యక్షుడు రాంబాబు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...