వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఉగాండాకు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను నెల్లూరు జైలుకు తరలించారు. ఈ కేసులో రూ.4 లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల విచారణలో ఆమె పాత్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Loading comments...
