వార్తలకు తిరిగి వెళ్లండి
30న కాలేజీల బంద్కు పిలుపు: ఆర్.కృష్ణయ్య
దివ్య శ్రీ Jun 27, 2026 2:27 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కాలేజీల బంద్కు ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రూ.8వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని, అదే రోజు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. 18 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...