వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగు నెలల క్రితమే ప్రేమవివాహం చేసుకున్న ఉపాధ్యాయిని శ్వేత (25) భర్త, ఆడపడుచు వేధింపుల కారణంగా బెంగళూరులోని సుంకదకట్టెలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. "అమ్మా.. తప్పు చేశాను, నన్ను క్షమించు" అంటూ తన తల్లికి ఆమె రాసిన ఆఖరి లేఖ లభ్యమైంది.
తన చావుకు కారణమైన భర్త, అతని సోదరిని వదలొద్దని శ్వేత లేఖలో పేర్కొంది. దీని ఆధారంగా కామాక్షిపాళ్య పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

