వార్తలకు తిరిగి వెళ్లండి
బాలీవుడ్ జూబ్లీ స్టార్ రాజేంద్రకుమార్

హిందీ చిత్రసీమలో పలు సిల్వర్జూబ్లీ చిత్రాల్లో నటించి ‘జూబిలీ కుమార్’గా గుర్తింపు తెచ్చుకున్న అగ్ర నటుడు రాజేంద్రకుమార్. దేశ విభజన తర్వాత ముంబయికి చేరిన ఆయన, అసిస్టెంట్ డైరెక్టరుగా ప్రయాణం మొదలుపెట్టి 1955లో వచ్చిన ‘వచన్’ చిత్రంతో విజయం అందుకున్నారు.
‘మదర్ ఇండియా’, ‘గూంజ్ ఉఠీ షెహనాయీ’, ‘మేరే మెహబూబ్’ వంటి వరుస హిట్లతో దశాబ్దకాలం పాటు తిరుగులేని హీరోగా వెలుగొందారు. 1970లో పద్మశ్రీ అందుకున్న ఆయన, 1999లో మరణించేవరకు తన నాలుగు దశాబ్దాల కెరీర్లో ఎనభైకి పైగా చిత్రాల్లో నటించారు.
Comments
Loading comments...