వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టవద్దని, అసలైన ఆర్థిక సునామీ కాంగ్రెస్ పాలనలోని 2013లోనే వచ్చిందని కమలం పార్టీ నేత అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ఆయన.. కొవిడ్, యుద్ధాలు వంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా తట్టుకునేలా మోదీ ప్రభుత్వం దేశాన్ని బలోపేతం చేసిందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
