వార్తలకు తిరిగి వెళ్లండి
అయోధ్య విరాళాల చోరీ కేసు: షాకింగ్ నిజాలు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆలయ లెక్కింపు గది తాళాలు దక్కించుకున్న నిందితులు, అక్కడ దొంగిలించిన సొమ్మును ఎవరికీ అనుమానం రాకుండా వాష్రూమ్లలో దాచి బయటకు తరలించారు.
ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మందిలో ఒకరైన అవినాష్ శుక్లాను పోలీసులు విచారించగా ఈ విషయాలు తెలిశాయి. లెక్కింపు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని టిన్నూ యాదవ్తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.
Comments
Loading comments...