వార్తలకు తిరిగి వెళ్లండి
గణేష్పల్లిలో పిచ్చికుక్క దాడి
Harika Jun 20, 2026 9:09 AM కరీంనగర్ 9 viewsabout 2 hours ago

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గణేష్పల్లిలో అర్ధరాత్రి పిచ్చికుక్క దాడి చేయడంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుబయట నిద్రిస్తున్న గ్రామస్తులపై కుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో ఐదుగురు మహిళలు, ఒక బాలుడు, ఎనిమిది మంది పురుషులు గాయపడ్డారు.
గాయపడిన వారందరినీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...