Back to feed
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు
Ritika Singh Jun 06, 2026 10:10 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago

జట్టులో స్థిరమైన చోటు లేని శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా నియమించడం సరికాదని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. అతడిని జట్టులోకి తీసుకోవడమే చర్చనీయాంశమైనప్పుడు, నేరుగా నాయకత్వ బాధ్యతలు అప్పగించడం తప్పు నిర్ణయం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ముందుగా అయ్యర్కు జట్టులో నిలకడగా అవకాశాలు కల్పించి, ఆ తర్వాతే కెప్టెన్సీ గురించి ఆలోచించాలని అశ్విన్ సూచించారు. గతేడాది ప్రపంచకప్ జట్టులోనే లేని వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



