వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్ కోర్టులో న్యాయవాదుల దీక్ష

జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు, సభ్యులను తొలగించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ న్యాయవాదులు కోర్టు గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల నగేష్ హెచ్చరించారు. ఆందోళనలు కొనసాగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...