వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో అదానీ భారీ అడుగు
ఒడిశా ప్రభుత్వంతో అదానీ ఎంటర్ప్రైజెస్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ ఇంకా ఆల్యూమినియం దిగుమతి చేసుకుంటున్నామని, మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉందని అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు.
పోటీతత్వంతో ఉత్పత్తిని పెంచితే భారత్ ఆల్యూమినియం ఎగుమతిదారుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అందరికీ తగినంత అవకాశం ఉందని, తాము ఎవరితోనూ పోటీ పడటం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...