వార్తలకు తిరిగి వెళ్లండి
56 లక్షల గంజాయి పట్టివేత

ఖమ్మం బైపాస్ రోడ్డులో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.56 లక్షల విలువైన 113 కేజీల గంజాయి పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అల్లూరి జిల్లా నుండి కార్లలో రహస్యంగా గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...