వార్తలకు తిరిగి వెళ్లండి
శిథిలావస్థలో 400 ఏళ్ల పురాతన ఆలయం

మల్యాల మండలం తక్కళ్లపల్లి శివారులోని కాకతీయుల కాలం నాటి వేంకటేశ్వరస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణాలు కూలిపోయి, విగ్రహాలు పరిసరాల్లో పడి ఉన్నాయి.
ప్రభుత్వం మంజూరు చేసిన రూ.39 లక్షల నిధులు టెండర్లు రాక ల్యాప్స్ అయ్యాయి. నిత్య పూజలు జరిగేలా ఆలయాన్ని పునరుద్ధరించాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...